తెలంగాణ

telangana

By

Published : May 27, 2020, 9:10 AM IST

ETV Bharat / state

'మద్యం మత్తులో స్నేహితుడినే చంపేశారు'

స్నేహితులు సరదాగా మందేశారు. మాటల్లో మునిగి తేలారు. ఈలోగా ఆ మాటలు పెరిగి పెద్దయ్యాయి. ఒకరిపై ఒకరు వాదనలకు దిగారు. ఈ గొడవ కాస్తా ముదిరి హత్యకు దారితీసింది. హైదరాబాద్​ జగద్గిరిగుట్ట పీఎస్​ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది.

A friend was killed in alcohol intoxication at hyderabad
'మద్యం మత్తులో స్నేహితుడినే చంపేశారు'

హైదరాబాద్​కు చెందిన హఫీజ్​ (23) స్థానికంగా మెకానిక్​ పనిచేసుకుంటూ జీవనం సాగించేవాడు. రాత్రి మరో ముగ్గురు స్నేహితులు అక్బర్​, అన్ను, సలీంలతో కలిసి మద్యం సేవించగా.. వీరి మధ్య మాట మాట పెరిగింది. హఫీజ్​ను మిగిలిని ముగ్గురు స్నేహితులు అతి దారుణంగా బండరాళ్లతో మోది హతమార్చారు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. కేసు దర్యాప్తు చేస్తున్నారు.

'మద్యం మత్తులో స్నేహితుడినే చంపేశారు'

ABOUT THE AUTHOR

...view details