తెలంగాణ

telangana

By

Published : Jul 13, 2020, 12:55 PM IST

ETV Bharat / state

విద్యుదాఘాతంతో భవన నిర్మాణ కార్మికుడు మృతి

విద్యుదాఘాతంతో భవననిర్మాణ కార్మికుడు మృతి చెందిన ఘటన హైదరాబాద్​ కేపీహెచ్​బీ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.

a construction labor dead due to electric shock in Hyderabad
విద్యుదాఘాతంతో భవన నిర్మాణ కార్మికుడు మృతి

ఒడిశాకు చెందిన నలీంద్ర 20 ఏళ్ల క్రితం హైదరాబాద్​ కేపీహెచ్​బీ కాలనీ అడ్డగుట్టలో భవన నిర్మాణ కార్మికులుగా పనిచేస్తూ కుటుంబ సభ్యులతో కలిసి నివాసముంటున్నాడు. రోజు లాగానే ఆదివారం భవన నిర్మాణ పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై.. మూడో అంతస్తు నుంచి కిందపడి పోడిపోయాడు.

తోటి కార్మికులు నలీంద్రను సమీపంలోని ఆసుపత్రికి తరలించగా మృతి చెందాడు. అయితే క్షతగాత్రుని వెంటనే ఆసుపత్రిలో చేర్చుకుని ఉంటే బతికేవాడని మృతుడి బంధువులు ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు. కాగా ఘటనా స్థలికి చేరుకుని పోలీసులు బాధితులకు నచ్చజెప్పి పంపించేశారు. అయితే మార్గమధ్యలోనే క్షతగాత్రుడు చనిపోయాడని వైద్యులు తెలిపారు.

ఇదీ చదవండి:హోం క్వారంటైన్​లో ఉన్నవారికి కరోనా కిట్లు

ABOUT THE AUTHOR

...view details