నెహ్రూ జంతు ప్రదర్శనశాలలో ఇటీవల కరోనా బారినపడిన 8 సింహాలు కోలుకున్నాయి. ఈ మేరకు అధికారులు అధికారికంగా వెల్లడించారు.
గత నెల 22న సింహాలు అనారోగ్యంగా కనిపించడంతో సిబ్బంది వెంటనే అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. వెటర్నరీ వైద్యులు సింహాలను గమనించి.. శ్వాసకోస సమస్యలతో పాటు.. జలుబుతో బాధపడుతున్నట్లు గుర్తించి తగిన వైద్యం అందించారు. గత నెల 24న జూ అధికారులు ఈ విషయాన్ని సీసీఎంబీ దృష్టికి తీసుకెళ్లగా.. వారు సింహాల ముక్కుల్లోంచి శ్రావాలను సేకరించి పరీక్షలు నిర్వహించారు. పాటిజిట్గా నిర్ధారణ అయినట్లు ఈ నెల 4న సీసీఎంబీ నుంచి జంతు ప్రదర్శనశాల అధికారులకు నివేదిక అందింది.