తెలంగాణ

telangana

77th Independence Day Celebrations At Golconda Fort : గోల్కొండ కోటలో జెండా ఎగురవేయనున్న సీఎం.. కేసీఆర్ స్పీచ్​పై సర్వత్రా ఆసక్తి

By

Published : Aug 15, 2023, 7:20 AM IST

Updated : Aug 15, 2023, 7:40 AM IST

77th Independence Day Celebrations At Golconda Fort : స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు గోల్కొండ కోట సిద్ధమైంది. ఇందుకు సంబంధించి అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు. కోట చుట్టు పక్కల ట్రాఫిక్‌ అంక్షలు విధించారు. సీఎం కేసీఆర్‌ ఉదయం 11 గంటలకు జాతీయ పతాకాన్ని అవిష్కరించనున్నారు. దాదాపు 20 నిమిషాల పాటు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రసంగించనున్నారు.

cm kcr independence day speech
Independence Day Celebrations

77th Independence Day Celebrations At Golconda Fort : గోల్కొండ కోటలో జెండా ఎగురవేయనున్న సీఎం.. కేసీఆర్ స్పీచ్​పై సర్వత్రా ఆసక్తి

77th Independence Day Celebrations At Golconda Fort : స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు గోల్కొండ కోట ముస్తాబైంది. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇక్కడ 77వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరగనున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్‌ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు. ముందుగా అధికారిక నివాసమైన ప్రగతి భవన్‌లో జెండా ఎగురవేసిన అనంతరం సీఎం కేసీఆర్ సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌కు వెళ్తారు. అక్కడ వీరుల స్మారకం వద్ద ముఖ్యమంత్రి పుష్పాంజలి ఘటంచాక.. గోల్కొండ కోటకు బయలుదేరుతారు. ఉదయం 11 గంటలకు గోల్కొండ కోటలోని రాణి మహల్ లాన్స్‌లో జాతీయ పతాకాన్ని ముఖ్యమంత్రి ఆవిష్కరిస్తారు. అనంతరం ఆ వేదిక నుంచి రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ముఖ్యమంత్రి ప్రసంగిస్తారు. త్వరలో ఎన్నికలు జరగనున్న తరుణంలో సీఎం చేయనున్న ప్రసంగంపై ఆసక్తి నెలకొంది. 20 నిమిషాలకు పైగా ముఖ్యమంత్రి ప్రసంగం ఉండవచ్చని తెలుస్తోంది. సాయంత్రం రాజ్ భవన్‌లో ఎట్ హోం కార్యక్రమం జరగనుంది.

"800 మంది పోలీసులు ఇక్కడ ఉన్నారు. అక్టోపస్‌ నుంచి 30 మంది నుంచి 40 మంది వరకు ఉన్నారు. 300 మంది వరకు ట్రాఫిక్‌ పోలీసులు ఉన్నారు. లంగర్​హౌజ్‌ నుంచి ట్రాఫిక్‌ అంక్షలు విధించాం. ప్రజలు ఈ పరిసరాల్లోకి రావొద్దు." -కిరణ్‌, డీసీపీ,హైదరాబాద్‌ నైరుతి జోన్‌

Bheema Facility To Panchayathiraj Employees : ఇదిలా ఉండగా.. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీ కార్మికులకు.. బీమా సదుపాయం కల్పించాలని నిర్ణయించింది. పంచాయతీ కార్మికులు మరణిస్తే.. రూ.5 లక్షల బీమా వర్తించేలా నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం కార్మికుల తరఫున.. ఎల్‌ఐసీకి రాష్ట్ర ప్రభుత్వం ప్రీమియం చెల్లించనుంది. రాష్ట్రంలోని 51 వేల మంది పంచాయతీ కార్మికులకు బీమా సౌకర్యం వర్తించనుంది. పంచాయతీ కార్మికుల అంత్యక్రియలకు ఇప్పటి వరకు ఇస్తున్న రూ.5 వేలను రూ.10 వేలకు పెంచారు. ఈ మేరకు పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు.

ఏర్పాట్లు పరిశీలించిన సీఎస్‌ శాంతికుమారి : స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు సంబంధించి ప్రభుత్వ ప్రధానకార్యదర్శి శాంతికుమారి గోల్కొండ కోటలో ఏర్పాట్లను సోమవారం పరిశీలించారు. పోలీస్‌, వివిధ శాఖల అధికారులతో కలిసి కోటలోని ఏర్పాట్లను పరిశీలించి పలు సూచనలు చేశారు. వేడుకల కారణంగా ఏఏ ఏరియాల్లో ట్రాఫిక్ అంక్షలు ఉంటాయో ప్రజలకు తెలియజేయాలన్నారు. గోల్కొండలో జరిగే స్వాతంత్య్ర వేడుకలను వీక్షించడానికి ప్రజలు అధిక సంఖ్యలో వస్తారని.. వాళ్లకి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. అన్ని శాఖల అధికారులు పూర్తి సమన్వయంతో పని చేసి వేడుకలను విజయవంతం చేయాలని కోరారు.

77th Independence Day : స్వాతంత్య్ర వేడుకలకు ముస్తాబైన భారత్​.. ఎర్రకోటపై పదోసారి ప్రధాని మోదీ ప్రసంగం

August 15 Flag Hoisting Rules in Telugu : జాతీయ జెండా ఎగరేస్తున్నారా..? ఇలా చేయాలి.. అలా చేస్తే అంతే!

అన్ని రంగాల్లో మహిళలు భళా.. 2047లోగా అభివృద్ధి చెందిన దేశంగా భారత్​!: ముర్ము

Last Updated : Aug 15, 2023, 7:40 AM IST

ABOUT THE AUTHOR

...view details