తెలంగాణ

telangana

ETV Bharat / state

క్యూనెట్​ కేసులో 70 మంది అరెస్ట్​

క్యూనెట్ అనుబంధ సంస్థ విహాన్ డైరెక్ట్ సెల్లింగ్... గొలుసుకట్టు విధానం పేరుతో వేల కోట్ల రూపాయల మోసాలకు పాల్పడిందని సైబరాబాద్ సీపీ సజ్జనార్ అన్నారు. ఈ కేసులో ఇప్పటికే 70మందిని అరెస్ట్ చేశామని..... దీనిపై కేంద్రం కూడా కఠిన చర్యలు తీసుకోవడానికి సిద్ధమైందని సజ్జనార్ తెలిపారు.

By

Published : Aug 30, 2019, 4:13 AM IST

Updated : Aug 30, 2019, 8:06 AM IST

సజ్జనార్​

క్యూనెట్​లో ఇప్పటి వరకు 38 కేసులు నమోదు చేసి.. 70 మందిని అరెస్ట్​ చేసినట్లు సైబరాబాద్​ సీపీ సజ్జనార్​ తెలిపారు. సినీ ప్రముఖులకూ నోటీసులు పంపించారు. అయితే తాము క్యూనెట్​కు సంబంధించిన ప్రకటనల్లో నటించలేదని పేర్కొన్నారు. క్యూనెట్‌ అనుబంధ సంస్థ విహాన్‌ సెల్లింగ్‌ కార్యాలయాన్ని సీజ్​ చేసినట్లు తెలిపారు. క్యూనెట్‌ బాధితులు లక్షల్లో ఉన్నారన్నారని సీపీ చెప్పారు. దేశవ్యాప్తంగా దిల్లీ, మహారాష్ట్ర, బెంగళూరులో క్యూనెట్​పై కేసులు నమోదైనట్లు సజ్జనార్‌ వివరించారు. సాఫ్ట్​​వేర్​ ఉద్యోగులే లక్ష్యంగా క్యూనెట్​ కుంభకోణం జరిగిందన్నారు. మంచి అవకాశం పేరిట నిరుద్యోగులను మోసగించినట్లు పేర్కొన్నారు. క్యూనెట్‌ బాధితులు లక్షల్లో ఉన్నారని సీపీ వెల్లడించారు.

క్యూనెట్​లో 70 మందిని అరెస్ట్​
Last Updated : Aug 30, 2019, 8:06 AM IST

ABOUT THE AUTHOR

...view details