రాష్ట్రంలో కొత్తగా 5,892 కరోనా కేసులు, 46మరణాలు - corona cases in telangana
![రాష్ట్రంలో కొత్తగా 5,892 కరోనా కేసులు, 46మరణాలు 46 deaths in telangana](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11670303-thumbnail-3x2-telangana.jpg)
09:19 May 07
ప్రస్తుతం 73,851 కరోనా క్రియాశీల కేసులు
రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. కొత్తగా 5,892 కేసులు నమోదయ్యాయని వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. మహమ్మారి బారిన పడి మరో 46 మంది మృతి చెందారని తెలిపింది. కొవిడ్ నుంచి 9,122 మంది బాధితులు కోలుకోగా... ప్రస్తుతం 73,851 క్రియాశీల కేసులున్నాయని పేర్కొంది.
నిన్న 76,047 మందికి పరీక్షలు నిర్వహించారు. 24గంటల్లో ఆదిలాబాద్ 74, భద్రాద్రి కొత్తగూడెం 97, జీహెచ్ఎంసీ 1,104, జగిత్యాల 143, జనగామ 53, జయశంకర్ భూపాలపల్లి 59, జోగులాంబ గద్వాల 86, కామారెడ్డి 66, కరీంనగర్ 263, ఖమ్మం 188, కొమరంభీం ఆసిఫాబాద్ 51, మహబూబ్ నగర్ 195, మహబూబాబాద్ 129, మంచిర్యాల 143, మెదక్ 99, మేడ్చల్ మల్కాజిగిరి 378, ములుగు 35, నాగర్ కర్నూల్ 204, నల్గొండ 323, నారాయణ పేట 58, నిర్మల్ 39, నిజామాబాద్ 139, పెద్దపల్లి 137, రాజన్న సిరిసిల్ల 97, రంగారెడ్డి 443, సంగారెడ్డి 193, సిద్దిపేట 201, సూర్యాపేట 89, వికారాబాద్ 148, వనపర్తి 113, వరంగల్ రూరల్ 100, వరంగల్ అర్బన్ 321, యాదాద్రి భువనగిరిలో 124చొప్పున కరోనా కేసులు నమోదయ్యాయి.