వేర్వేరు ప్రాంతాల్లో ముగ్గురు యువతులు అదృశ్యమైన ఘటన హైదరాబాద్ చిలకలగూడ పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది. చిలకలగూడ పార్క్ వద్ద నివాసముంటున్న జ్యోతి అనే యువతి పద్మారావు నగర్లోని శ్రీ సాయి డిగ్రీ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతోంది. కళాశాలకని వెళ్లిన యువతి తిరిగి ఇంటికి రాకపోవడం వల్ల కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
హైదరాబాద్లో ముగ్గురు యువతుల అదృశ్యం - హైదరాబాద్లో ముగ్గురు యువతుల అదృశ్యం
హైదరాబాద్ చిలకలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో ముగ్గురు యువతులు అదృశ్యమైనట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
![హైదరాబాద్లో ముగ్గురు యువతుల అదృశ్యం missing](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5867062-552-5867062-1580183926733.jpg)
హైదరాబాద్లో ముగ్గురు యువతుల అదృశ్యం
వారసిగూడలో శ్రావణి అనే యువతి సీతాఫల్మండిలోని మోర్ సూపర్ మార్కెట్లో విధులు నిర్వహిస్తోంది. సెలవు ఉండడం వల్ల బయటకు వెళ్లిన ఆమె తిరిగి ఇంటికి రాకపోవడం వల్ల కుటుంబ సభ్యులు చిలకలగూడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మరొక కేసులో మహమ్మద్గూడ ప్రాంతానికి చెందిన జూలేక బేగమ్ అనే యువతి కూడా అదృశ్యమైనట్లు ఫిర్యాదు వచ్చినట్లు పోలీసులు తెలిపారు. ఈ మూడు కేసులను నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామన్నారు.
హైదరాబాద్లో ముగ్గురు యువతుల అదృశ్యం
ఇవీ చూడండి: రుణాలు సేకరించి ప్రాజెక్టులు కట్టాం.. నిధులివ్వండి: హరీశ్