తెలంగాణ

telangana

ETV Bharat / state

హైదరాబాద్​లో ముగ్గురు యువతుల అదృశ్యం - హైదరాబాద్​లో ముగ్గురు యువతుల అదృశ్యం

హైదరాబాద్​ చిలకలగూడ పోలీస్ స్టేషన్​ పరిధిలో ముగ్గురు యువతులు అదృశ్యమైనట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

missing
హైదరాబాద్​లో ముగ్గురు యువతుల అదృశ్యం

By

Published : Jan 28, 2020, 10:36 AM IST

వేర్వేరు ప్రాంతాల్లో ముగ్గురు యువతులు అదృశ్యమైన ఘటన హైదరాబాద్​ చిలకలగూడ పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది. చిలకలగూడ పార్క్ వద్ద నివాసముంటున్న జ్యోతి అనే యువతి పద్మారావు నగర్​లోని శ్రీ సాయి డిగ్రీ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతోంది. కళాశాలకని వెళ్లిన యువతి తిరిగి ఇంటికి రాకపోవడం వల్ల కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

వారసిగూడలో శ్రావణి అనే యువతి సీతాఫల్​మండిలోని మోర్ సూపర్ మార్కెట్​లో విధులు నిర్వహిస్తోంది. సెలవు ఉండడం వల్ల బయటకు వెళ్లిన ఆమె తిరిగి ఇంటికి రాకపోవడం వల్ల కుటుంబ సభ్యులు చిలకలగూడ పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. మరొక కేసులో మహమ్మద్​గూడ ప్రాంతానికి చెందిన జూలేక బేగమ్ అనే యువతి కూడా అదృశ్యమైనట్లు ఫిర్యాదు వచ్చినట్లు పోలీసులు తెలిపారు. ఈ మూడు కేసులను నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామన్నారు.

హైదరాబాద్​లో ముగ్గురు యువతుల అదృశ్యం

ఇవీ చూడండి: రుణాలు సేకరించి ప్రాజెక్టులు కట్టాం.. నిధులివ్వండి: హరీశ్

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details