తెలంగాణ

telangana

రాష్ట్రంలో 2 లక్షల 87వేలు దాటిన కరోనా కేసులు

By

Published : Jan 2, 2021, 10:00 AM IST

తెలంగాణలో కొత్తగా మరో 293 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయింది. ఇప్పటివరకు 2,87,108 కేసులు నమోదయ్యాయి. కొవిడ్‌ కాటుకు 1,546 మంది బలయ్యారు.

293 new corona cases and 2 deaths were reported in Telangana
రాష్ట్రంలో 2 లక్షల 87వేలు దాటిన కరోనా కేసులు

రాష్ట్రంలో కొత్తగా 293 కరోనా కేసులు నమోదయ్యాయి. మహమ్మారి సోకి ఇద్దరు మృతి చెందారు. ఇప్పటివరకు 2,87,108 కరోనా కేసులు నమోదవ్వగా.. ఇప్పటివరకు 1,546 మంది మరణించారు. కరోనా నుంచి మరో 535 మంది బాధితులు డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు 2,79,991 మంది బాధితులు కొవిడ్ నుంచి కోలుకున్నారు.

రాష్ట్రంలో ప్రస్తుతం 5,571 యాక్టివ్ కేసులుండగా.. 3,418 మంది బాధితులు హోం ఐసోలేషన్​లో ఉన్నారు. జీహెచ్​ఎంసీ పరిధిలో కొత్తగా 72 కరోనా కేసులు నమోదయ్యాయి.

ఇదీ చూడండి:సంక్షోభంలో కొత్త అవకాశాలు.. రుజువు చేసిన కరోనా కాలం

ABOUT THE AUTHOR

...view details