హైదరాబాద్లో కరోనా కేసులు కలకలం సృష్టిస్తున్నాయి. కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలో బుధవారం అత్యధికంగా 21 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు అధికారులు ప్రకటించారు. నిజాంపేట్లోని వివిధ అపార్టుమెంట్లలో 4 కేసులు నమోదవగా... గాజులరామరం పరిధిలో ఇద్దరు మహిళలకు పాజిటివ్గా నిర్ధారణ అయింది.
కుత్బుల్లాపూర్లో కరోనా కలకలం... 21 కేసులు నమోదు - హైదరాబాద్లో కరోనా కేసులు
హైదరాబాద్లో రోజురోజుకూ పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులు ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నాయి. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో కరోనా వైరస్ కలకలం సృష్టించింది. ఒక్కరోజే ఏకంగా 21 మందికి పాజిటివ్ అని తేలగా... స్థానికులంతా ఆందోళనకు గురవుతున్నారు.
![కుత్బుల్లాపూర్లో కరోనా కలకలం... 21 కేసులు నమోదు 21 positive cases in kutbullapur constituency](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7751842-693-7751842-1592997950811.jpg)
21 positive cases in kutbullapur constituency
జీడీమెట్ల పరిధిలోని వివిధ కాలనీల్లో 5 కేసులు నమోదవగా... సుచిత్రలో ముగ్గురు కొవిడ్ బారిన పడ్డారు. చింతల్లో మరో ఇద్దరికి కరోనా సోకింది. ఇవే కాక.. నియోజకవర్గంలోని వివిధ కాలనీల్లో మరో 5 పాజిటివ్ కేసులు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.