2024-25 Academic Year BTech Computer Science, IT Seats Increase : రాష్ట్రంలో 2024-25 విద్యా సంవత్సరం నాటికి మరిన్ని బీటెక్ కంప్యూటర్ సైన్స్, ఐటీ సంబంధిత సీట్లు అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటికే 75 శాతానికి పైగా ఉండగా, ఈసారి వాటి సంఖ్య మరింతగా పెరగనుంది. ఇప్పటి వరకు సీట్ల సంఖ్యపై పరిమితి విధించిన అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) దాన్ని ఎత్తివేసింది. గైడ్లైన్స్ పాటించే కళాశాలలకు ఒక బ్రాంచీకి 240 సీట్లకు మించి ఏఐసీటీఈ అనుమతి ఇవ్వడం లేదు. ఎన్బీఏ గుర్తింపు ఉంటే ఆ పరిమితికి మించి సీట్లు పెంచవచ్చు.
National Board of Accreditation : యూజీసీ స్వయం ప్రతిపత్తి(న్యాక్) ‘ఏ’ గ్రేడ్ 30 శాతం కోర్సులకు నేషనల్ బోర్డు ఆఫ్ అక్రిడిటేషన్ (ఎన్బీఏ) గుర్తింపు, వరుసగా అయిదేళ్లపాటు 80 శాతం సీట్లు భర్తీ అయిన కళాశాలలకు మూడేళ్ల పాటు అనుమతులు మంజూరు చేయడమే కాదు పరిమితికి మించి ఎక్కువ సీట్లను ఇస్తారు. ముఖ్యంగా సీట్లకు అనుగుణంగా మౌలిక వసతుల కల్పన, బోధించే వారు ఉంటే చాలు. 2024-25 కళాశాలల అనుమతుల నిబంధనావళిలో ఈ విషయాన్ని పొందు పరచడం దరఖాస్తుల ప్రక్రియ మొదలు కావడంతో కళాశాలలు ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నాయి. నూతన కోర్సులు, సీట్లు కావాలని అప్లై చేసుకుంటే ఏఐసీటీఈ నియమించే నిపుణుల సందర్శన కమిటీ (ఈవీసీ) కళాశాలను చెక్ చేస్తుంది.
పల్లవి ఇంజినీరింగ్ కళాశాలలో... నాసా స్పేస్ యాప్స్ ఛాలెంజ్ 2022