తెలంగాణ

telangana

ETV Bharat / state

ఏపీలో విజృంభిస్తున్న కరోనా... ఒక్కరోజులో 43 మంది మృతి - corona updates

ఏపీలో కరోనా రోజురోజుకు విజృంభిస్తోంది. కొత్తగా 1916 కేసులు నమోదు కాగా... 43 మంది మృతి చెందారు. ఇప్పటివరకు 408 మంది వైరస్ కారణంగా మృత్యువాతపడ్డారు. ప్రస్తుతం 15,144 మంది చికిత్స పొందుతున్నారని ఏపీ వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించారు.

1916-new-more-corona-positive-cases-conformed-in-ap
ఏపీలో విజృంభిస్తున్న కరోనా... ఒక్కరోజులో 43 మంది మృతి

By

Published : Jul 14, 2020, 2:10 PM IST

ఆంధ్రప్రదేశ్​లో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో 22,670 మంది నమూనాలు పరీక్షించగా 1916 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయినట్లు ఏపీ వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్‌లో తెలిపింది. వీటిలో పొరుగు రాష్ట్రాలకు సంబంధించిన 8 కేసులు ఉండగా.. రాష్ట్రంలో 1908 పాజిటివ్‌ కేసులు వచ్చాయి. పొరుగు దేశాలు, రాష్ట్రాల నుంచి వచ్చిన వారితో కలిపి ఇప్పటివరకు మొత్తం 33,019 కేసులు నమోదయ్యాయి. కొవిడ్‌ కారణంగా గడచిన 24 గంటల్లో 43 మంది మృతి చెందారు.

అనంతపురంలో 10, పశ్చిమగోదావరి జిల్లాలో 9, చిత్తూరులో 5, తూర్పుగోదావరిలో 5, కడపలో 5, కర్నూలు జిల్లాలో ముగ్గురు, ప్రకాశం జిల్లాలో ముగ్గురు, విశాఖపట్నంలో ఇద్దరు, విజయనగరంలో ఒకరు కరోనాతో మృతి చెందారు. ఇప్పటి వరకు కొవిడ్ కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 408కి చేరింది. వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొంది కోలుకుని డిశ్చార్జి అయిన వారి సంఖ్య 17,467కి చేరింది. ప్రస్తుతం వివిధ కొవిడ్‌ ఆసుపత్రుల్లో 15,144 మంది చికిత్స పొందుతున్నారు.

ఇదీ చదవండి:సచిన్​ పైలట్​ మద్దతుదారుల సమావేశం.. వీడియో వైరల్​

ABOUT THE AUTHOR

...view details