తెలంగాణ

telangana

తెలంగాణలో మరో 1,597 కరోనా పాజిటివ్ కేసులు , 11 మంది మృతి

By

Published : Jul 15, 2020, 10:08 PM IST

Published : Jul 15, 2020, 10:08 PM IST

Updated : Jul 15, 2020, 11:06 PM IST

1,597 new corona cases has reported in telangana
తెలంగాణలో మరో 1,597 కరోనా పాజిటివ్ కేసులు , 11 మంది మృతి

22:06 July 15

తెలంగాణలో మరో 1,597 కరోనా పాజిటివ్ కేసులు , 11 మంది మృతి

తెలంగాణలో మరో 1,597 కరోనా పాజిటివ్ కేసులు , 11 మంది మృతి

రాష్ట్రంలో  కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. బుధవారం కొత్తగా 1,597 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపి మొత్తం కేసుల సంఖ్య 39,342కు చేరింది. కొవిడ్​తో మరో 11 మంది మృతి చెందగా... మొత్తం మృతుల సంఖ్య 386కు పెరిగింది. కరోనా నుంచి కోలుకుని మరో 1,159 మంది డిశ్చార్జయ్యారు. ఇప్పటి వరకు వైరస్​ నుంచి కోలుకున్న వారి సంఖ్య 25,999 చేరింది. ప్రస్తుతం 12,958 కరోనా యాక్టివ్‌ కేసులుండగా... వీరు హోం ఐసోలేషన్​, ఆస్పత్రుల్లో ఉన్నారు.  

బుధవారం జీహెచ్‌ఎంసీ పరిధిలో 796 కరోనా కేసులు నమోదు కాగా.. రంగారెడ్డి జిల్లాలో 212 కేసులొచ్చాయి. మేడ్చల్​ జిల్లాలో 115, సంగారెడ్డి 73, నల్గొండ 58, వరంగల్​ అర్బన్​ 44, కరీంనగర్​ 41, కామారెడ్డి 30, సిద్దిపేట 27, మంచిర్యాల 26,  మహబూబ్​నగర్​ 21, పెద్దపల్లి 20, మెదక్​ 18, జయశంకర్​ భూపాలపల్లి 15, సూర్యాపేట 14, యాదాద్రి భువనగిరి జిల్లా, నిజామాబాద్​ 13 చొప్పున, జనగాం 8, భద్రాద్రి కొత్తగూడెం 7,  ఖమ్మం, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో 6 చొప్పున, మహబూబాబాద్, వనపర్తి, నారాయణపేట, వికారాబాద్​, నాగర్​ కర్నూల్​ జిల్లాల్లో 5 చొప్పన, ములుగు,  గద్వాల్​ జిల్లాల్లో 4 చొప్పున, ఆదిలాబాద్ జిల్లాలో​ ఒక కేసు నమోదైంది.  

ఇదీ చూడండి:టార్గెట్ సచిన్... కాంగ్రెస్ కీలక నిర్ణయం

Last Updated : Jul 15, 2020, 11:06 PM IST

ABOUT THE AUTHOR

...view details