రాష్ట్రంలో 50 వేలు దాటిన కరోనా కేసులు - తెలంగాణలో కరోనా కేసులు
![రాష్ట్రంలో 50 వేలు దాటిన కరోనా కేసులు 1567 new corona cases has reported in telangana today](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8147170-160-8147170-1595520779801.jpg)
21:02 July 23
రాష్ట్రంలో 50 వేలు దాటిన కరోనా కేసులు
రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 50 వేలు దాటింది. కొత్తగా 1567 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా మొత్తం కేసుల సంఖ్య 50,826కు చేరింది. గురువారం కొవిడ్తో 9 మంది మృతి చెందగా.. మొత్తం మరణాల సంఖ్య 447కు పెరిగింది. వైరస్ నుంచి కోలుకుని కొత్తగా 1,661 డిశ్చార్జయ్యారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 39,327కు చేరింది. ప్రస్తుతం వివిధ ఆస్పత్రులు, హోం ఐసోలేషన్లో 11,052 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు.
జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 662 కరోనా కేసులు నమోదు కాగా.. రంగారెడ్డి జిల్లాలో 213, వరంగల్ అర్బన్ 75, రాజన్న సిరిసిల్ల 62, మహబూబ్నగర్ 61, నాగర్కర్నూలు 51 కేసులు నమోదయ్యాయి.