కరోనా మహమ్మారితో విలవిల్లాడుతున్న బాధితుల కోసం కొవిడ్-19 ప్లాస్మా రక్తదాన శిబిరాన్ని నిర్వహించనున్నట్లు ప్రొఫెషనల్ సాలిడారిటీ ఫోరం తెలిపింది. ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ బ్లడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా హైదరాబాద్లోని 15 ప్రాంతాల్లో క్యాంప్ను ప్రారంభించనన్నట్లు ఫోరం ప్రతినిధి జబ్బార్ సయ్యద్ వెల్లడించారు.
ఆగస్టు 15 నుంచి హైదరాబాద్లో 15 ప్రాంతాల్లో ప్లాస్మా రక్తదాన శిబిరం - 15 places in hyderabad to start plasma donation camps
ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా హైదరాబాద్లోని 15 ప్రాంతాల్లో కొవిడ్-19 ప్లాస్మా రక్తదాన శిబిరాన్ని ప్రారంభించనన్నట్లు ప్రొఫెషనల్ సాలిడారిటీ ఫోరం ప్రతినిధి జబ్బార్ సయ్యద్ వెల్లడించారు. ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ బ్లడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ క్యాంప్లో ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా పాల్గొనాలని నిర్వాహకులు కోరారు.
![ఆగస్టు 15 నుంచి హైదరాబాద్లో 15 ప్రాంతాల్లో ప్లాస్మా రక్తదాన శిబిరం 15 places in hyderabad to start plasma donation camps](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8403883-59-8403883-1597316005949.jpg)
ఆగస్టు 15 నుంచి హైదరాబాద్లో 15 ప్రాంతాల్లో ప్లాస్మా రక్తదాన శిబిరం
ఆగస్టు 22 వరకు జరగనున్న రక్తదాన శిబిరానికి.. ప్లాస్మాదానం చేసేందుకు దాతలు ముందుకు రావాలని నిర్వాహకులు కోరారు. కరోనా వైరస్తో కొట్టుమిట్టాడుతున్న బాధితుల ప్రాణాలు కాపాడేందుకు ప్రతి ఒక్కరు ప్లాస్మాదానం చేసేలా ప్రజల్లో అవగాహన పెంచేందుకు శిబిరాలు ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. కరోనా వ్యాధితో కోలుకున్న ప్రతి ఒక్కరు ప్లాస్మాదానం చేసి తోటి వారి ప్రాణాలు కాపాడాలన్నారు.
ఇదీ చూడండి: రష్యా టీకాపై ఇప్పుడే ఏమీ చెప్పలేం: ఎయిమ్స్