రాష్ట్రంలో కొత్తగా 1,178 కరోనా కేసులు - తెలంగాణలో కరోనా కేసులు
![రాష్ట్రంలో కొత్తగా 1,178 కరోనా కేసులు 1178 new corona cases has reported in telanagna today](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7989471-513-7989471-1594484775842.jpg)
21:07 July 11
రాష్ట్రంలో కొత్తగా 1,178 కరోనా కేసులు
రాష్ట్రంలో శనివారం మరో 1,178 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపి మొత్తం కేసుల సంఖ్య 33,402కు చేరింది. కొవిడ్తో మరో తొమ్మిది మంది మృతి చెందగా మొత్తం మృతుల సంఖ్య 348కి పెరిగింది. కరోనా నుంచి కోలుకుని 1,714 మంది డిశ్చార్జ్ కాగా.. రాష్ట్రంలో ఇప్పటివరకు 20,919 మంది కోలుకని ఇంటికెళ్లారు. ప్రస్తుతం వివిధ ఆస్పత్రుల్లో 12,135 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు.
జీహెచ్ఎంసీ పరిధిలోనే 736 కరోనా కేసులు నమోదు కాగా రంగారెడ్డి జిల్లాలో 125, మేడ్చల్ జిల్లాలో 101 కేసులొచ్చాయి. కరీంనగర్, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 24 చొప్పున, వరంగల్ అర్బన్ జిల్లాలో 20 కేసులు నమోదయ్యాయి.