తెలంగాణ

telangana

By

Published : Apr 27, 2021, 9:15 AM IST

Updated : Apr 27, 2021, 9:56 AM IST

ETV Bharat / state

రాష్ట్రంపై కరోనా పంజా.. ఒక్కరోజే పదివేలకు పైగా కేసులు

10122-new-corona-cases-registered-in-telangana
రాష్ట్రంపై కరోనా పంజా.. ఒక్కరోజే పదివేలకు పైగా కేసులు

09:11 April 27

రికార్డు స్థాయిలో కరోనా కేసులు

రాష్ట్రంలో కరోనా మహోగ్రరూపం దాల్చింది. ఒక్కరోజే అత్యధికంగా 10,122 మందికి వైరస్ పాజిటివ్​గా నిర్ధరణ అయింది. ఏకంగా 52 మంది వైరస్ బారినపడి మృత్యువాతపడ్డారు. కరోనా మొదలైన నాటి నుంచి తెలంగాణలో ఈ స్థాయిలో కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. జిల్లాల్లోనూ వైరస్ వేగంగా విస్తరిస్తుండటంతో ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. 

ప్రస్తుతం 69,221 యాక్టివ్‌ కేసులు ఉన్నట్లు వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. వైరస్​ నుంచి కోలుకుని మరో 6,446 మంది డిశ్చార్జి అయ్యారు. రాష్ట్రంలో గడిచిన24 గంటల్లో 99,638 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. 

ఇదీ చూడండి:పది రెట్లు ధర పెంచి కరోనా మందుల అమ్మకం..!

Last Updated : Apr 27, 2021, 9:56 AM IST

ABOUT THE AUTHOR

...view details