"కేరళ వరదల సమయంలో మత్స్యకారులు ప్రముఖ పాత్ర పోషించారు. వారి ఇళ్లు, పడవలు ధ్వంసమైనా ప్రాణాలను పణంగా పెట్టి బాధితులను కాపాడారు. ఓ వృద్ధున్ని పడవలోకి ఎక్కించడానికి మత్స్యకారుడు నీటిలో పడుకొని సహాయపడిన తీరు వారి గొప్పదనాన్ని వెల్లడిస్తోంది. సహాయక కార్యక్రమాల్లోనూ మత్స్యకారులు కీలకంగా వ్యవహరించారు. నోబెల్ శాంతికి వారు అర్హులు."
"కేరళ మత్స్యకారులకు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలి"
కేరళ వరదల సమయంలో సహాయక కార్యక్రమాల్లో పాల్గొన్న మత్స్యకారులకు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలని కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ కోరారు.
శశిథరూర్
-శశిథరూర్, ఎంపీ
2018 ఆగస్టులో నైరుతి రుతుపవనాలతో కేరళలో భారీ వర్షాలు కురిశాయి. వరదలతో కేరళ పూర్తిగా ధ్వంసమైంది. ఈ విపత్తులో సుమారు 488 మంది మరణించారు.