తెలంగాణ

telangana

ETV Bharat / state

వాద్రాను ఆరు గంటలపాటు ప్రశ్నించిన ఈడీ

లండన్​లో అక్రమ ఆస్తుల కొనుగోలుకు సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో....రాబర్ట్ వాద్రాను ఈడీ సుమారు ఆరు గంటలపాటు విచారించింది.

By

Published : Feb 7, 2019, 7:42 AM IST

ఈడీ కార్యాలయానికి వెళుతున్న ప్రియాంక, వాద్రా

మనీ లాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న యూపీఏ అధ్యక్షురాలు సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రాను ఐదున్నర గంటలపాటు ప్రశ్నించింది ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టరేట్​(ఈడీ). ఫిబ్రవరి 6న ఈడీ విచారణకు హాజరు కావాలని దిల్లీ కోర్టు ఆదేశాలిచ్చింది. వాద్రా విచారణకు హాజరవడం ఇదే తొలిసారి.

నగదు లావాదేవీలు, స్థిరాస్తి అమ్మకాలు, కొనుగోలుపై డజనుకుపైగా ప్రశ్నలను ఎన్​ఫోర్స్​మెంట్​ సంధించింది. రాజకీయ పరంగా తన మీద ఆరోపణలు చేస్తున్నారని విచారణలో వాద్రా తెలిపారు. తనపై వచ్చిన ఆరోపణలన్నీ అవాస్తవాలని స్పష్టం చేశారు.

"వాద్రాపై ఉన్న ఆరోపణలన్నీ ఆసత్యాలు. మేం ఈడీకి వందశాతం సహకరిస్తాం. ఎప్పుడు పిలిచినా వాద్రా హాజరవుతారు."
-సుమన్ జ్యోతి కేతన్​, వాద్రా తరఫు న్యాయవాది.

కోర్టు ఆదేశాల మేరకు జామ్​నగర్​లోని ఈడీ కార్యాలయానికి వాద్రా.. ఆయన భార్య ప్రియాంక గాంధీ కలిసి వెళ్లారు. కొద్దిసేపటి తర్వాత ప్రియాంక అక్కడనుంచి వెళ్లిపోయి తూర్పు ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్​ కార్యదర్శిగా బాధ్యతలను స్వీకరించారు.

నా కుటుంబానికి మద్దతు ఇస్తా: ప్రియాంక

వాద్రాకు తన మద్దతు ఉంటుందని ప్రియాంక గాంధీ స్పష్టం చేశారు.

"అతను నా భర్త. నా కుటుంబానికి నా మద్దతు ఎప్పుడూ ఉంటుంది."

-ప్రియాంక గాంధీ, తూర్పు ఉత్తర ప్రదేశ్ కాంగ్రెస్​ కార్యదర్శి

ABOUT THE AUTHOR

...view details