సినీనటుడు, నర్సాపురం జనసేన పార్టీ ఎంపీ అభ్యర్థి నాగబాబుకు ప్రజలెవరూ ఓటు వేయొద్దని తెలుగు సినీ నటీనటుల సంఘం(మా) మాజీ అధ్యక్షుడు శివాజీ రాజా హైదరాబాద్లో సంచలన వ్యాఖ్యలు చేశారు. మా అధ్యక్షునిగా రెండేళ్లు పనిచేసినా... అసోసియేషన్ అభివృద్ధికి ఏం చేయలేదని ఆరోపించారు. నాగబాబును ఎంపీగా గెలిపిస్తే నియోజకవర్గం మురికి కూపంగా తయారవుతుందని హెచ్చరించారు. సరైన నాయకులనే ప్రజలు ఎన్నుకోవాలని శివాజీరాజా కోరారు.
'నాగబాబుకు ఓటు వేయొద్దు': శివాజీరాజా - elections 2019
సినీ నటుడు నాగబాబుపై మా అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు శివాజీరాజా మండిపడ్డారు. నర్సాపూర్ ఎంపీ అభర్థిగా పోటీ చేస్తున్న నాగబాబుకు ఓటేయొద్దంటూ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.

మీడియా సమావేశంలో మాట్లాడుతున్న శివాజీరాజా
మీడియా సమావేశంలో మాట్లాడుతున్న శివాజీరాజా