హైదరాబాద్ పాతబస్తీలో ఛార్మినర్ నుండి షాలీబండ వెళ్లే మార్గంలో ఓ పురాతన భవనం శిథిలావస్థలో ఉండి అటు ప్రయాణికులకు ఇటు రోడ్డు వెడల్పునకు ఇబ్బందిగా మారింది. ఇవాళ జీహెచ్ఎంసీ అధికారులు హుస్సేనీ ఆలం పోలీసుల సహకారంతో కూల్చివేశారు. ఈ సందర్భంగా షాలీబండ కూడలి నుండి చార్మినార్ వెళ్లే మార్గాన్ని ట్రాఫిక్ సిబ్బంది తాత్కాలికంగా మూసివేసి ఇతర మార్గాల నుండి వాహనాలను దారి మళ్లించారు.
పాతబస్తీ పురాతన భవనాన్ని కూల్చివేసిన జీహెచ్ఎంసీ
పాతబస్తీలో శిథిలావస్థలో ఉండి రోడ్డు వెడల్పునకు అడ్డుగా ఉన్న ఓ పురాతన భవనాన్ని బల్దియా అధికారులు మూడు జేసీబీలతో భారీ పోలీస్ బందోబస్తు మధ్య కూల్చివేశారు.
పాతబస్తీలో పురాతన భవనాన్న కూల్చివేసిన జీహెచ్ఎంసీ