ఇంటర్ ఫలితాల్లో అవకతవకలపై ఆందోళనలు ఇంకా చల్లారడం లేదు. సమగ్ర న్యాయ విచారణ జరిపించాలనే డిమాండ్తో వామపక్షాలు నాంపల్లిలోని ఇంటర్ కార్యాలయాన్ని ముట్టడించాయి. లోనికి చొచ్చుకుపోయేందుకు యత్నించగా... అడ్డుకున్న పోలీసులు బేగంబజార్ ఠాణాకు తరలించారు.
గవర్నర్కు ఏబీవీపీ ఫిర్యాదు
ఇంటర్ ఫలితాల్లో జరిగిన అవకతవకలపై జోక్యం చేసుకోవాలని గవర్నర్ నరసింహన్ను ఏబీవీపీ నేతలు కోరారు. రాజ్భవన్లో గవర్నర్ను కలిసిన విద్యార్థి సంఘం నాయకులు వినతిపత్రం ఇచ్చారు. బాధిత విద్యార్థుల కుటుంబాలకు సర్కార్ బాసటగా నిలవాలని కోరారు.
ఉద్రిక్తంగా మారిన ఎన్ఎస్యూఐ ఆందోళన
ఇంటర్ విద్యను గాడినపెట్టాల్సిన బాధ్యత సర్కార్దేనంటూ ఇందిరాపార్కు ధర్నాచౌక్ వద్ద ఎన్ఎస్యూఐ నేతలు ఆందోళన చేశారు. వీరంతా సచివాలయం వైపు వెళ్తుండగా పోలీసులు అరెస్ట్ చేసి గోషామహల్ ఠాణాకు తరలించారు.