ఇంటర్మీడియట్ ఫలితాల్లో జరిగిన అవకతవకలపై సమగ్ర విచారణ జరిపించాలని కోరుతూ విద్యార్థులు, తల్లిదండ్రులు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ను ఆశ్రయించారు. మొదటి సంవత్సరంలో టాపర్గా నిలిచిన విద్యార్థి రెండో సంవత్సరంలో ఒక సబ్జెక్ట్లో ఫెయిల్ కావడం అధికారుల నిర్లక్ష్యమేనని ఆరోపించారు. మూల్యాంకనంలో అవకతవకలతో 16 మంది విద్యార్థులు బలయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం జోక్యం చేసుకొని... విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న బోర్డు అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకునేలా కమిషన్ ఆదేశాలివ్వాలని ఫిర్యాదులో కోరారు.
ఇంటర్ బోర్డు నిర్వాకంపై హెచ్చార్సీలో ఫిర్యాదు - inter students
ఇంటర్మీడియట్ ఫలితాల వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని తల్లిదండ్రులు, నాయకులు బోర్డు ముందు ఆందోళనలు చేస్తున్నారు. మూల్యాంకనంలో అవకతవకలపై తాజాగా మానవ హక్కుల కమిషన్లో ఫిర్యాదు దాఖలైంది.

హెచ్చార్సీలో ఫిర్యాదు
Last Updated : Apr 23, 2019, 6:27 PM IST