తెలంగాణ

telangana

By

Published : Feb 22, 2019, 1:22 PM IST

ETV Bharat / state

రైతులకు రూ.18,650 కోట్లు

శాసనసభలో ప్రవేశపెట్టిన ఓట్​ ఆన్ అకౌంట్ బడ్జెట్​లో రైతులకు రుణమాఫీ, రైతుబంధు, రైతుబీమాల పథకాల కోసం 18,650 కోట్లను ప్రభుత్వం ప్రతిపాదించింది.

రైతులకు 18,650 కోట్ల కేటాయింపు

.

రైతులకు 18,650 కోట్ల కేటాయింపు

తెలంగాణ శాసనసభలో ఓటాన్​ అకౌంట్​ బడ్జెట్​ను ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్​రావు ప్రవేశపెట్టారు. రైతుల పరిస్థితి చక్కబడేంత వరకు అన్ని విధాల వారిని ఆదుకుంటామని కేసీఆర్ తెలిపారు.
రైతు రుణమాఫీకు రూ.6,000కోట్లు
గత ఎన్నికల్లో పంట రుణాల మాఫీ కోసం ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. ఈ ఏడాది బడ్జెట్​లో రైతు రుణమాఫీకోసం రూ.6,000 కోట్లు ప్రతిపాదించారు.
రైతు బంధుకు 12,000 కోట్లు
రైతులు అప్పుల ఊబిలో పడకుండా గత పాలనాసమయంలో రైతు బంధు పథకాన్ని ప్రవేశపెట్టాం. ఏటా ఎకరానికి 8వేల రూపాయలను అందజేశాం. ఈ ఏడాది ఎకరానికి 10వేల రూపాయలకు పెంచుతూ రైతు బంధు పథకం కోసం రూ.12,000 కోట్లు ప్రతిపాదించారు సీఎం కేసీఆర్.
రైతు బీమాకు రూ.650 కోట్లు
దురదృష్టవశాత్తు ఏ రైతైనా మరణిస్తే వారి కుటుంబానికి సాయం చేసేందుకు రైతుబీమా పథకాన్ని ప్రభుత్వం ప్రవేశ పెట్టింది. ఈ ఏడు బడ్జెట్​లో రైతుల తరఫున బీమాకిస్తీ కట్టడం కోసం రూ. 650 కోట్లను ప్రభుత్వం కేటాయించింది.

ABOUT THE AUTHOR

...view details