ప్రజల గొంతుకను అసెంబ్లీలో వినిపిస్తా: భట్టి
కాంగ్రెస్ పార్టీలో తానొక సామాన్య కార్యకర్తనని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. అత్యంత బలమైన రాజకీయ పార్టీకి సంబంధించిన శక్తిగా వేసే ప్రతి అడుగు ఆచితూచి వేస్తానని తెలిపారు.
BATTI
విద్యార్థి దశ నుంచే కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా పనిచేస్తున్నానని భట్టి విక్రమార్క తెలిపారు. సీఎల్పీ నేతగా ఎన్నికైన సందర్భంగా ఓబీసీ సెల్ ఛైర్మన్ చిత్తరంజన్దాస్, బీసీ నేతలు భట్టిని ఘనంగా సన్మానించారు. అనేక సార్లు గడ్డు పరిస్థితులను ఎదుర్కొని హస్తం పార్టీ బలపడిందని, ప్రజల గొంతుకను సీఎల్పీ నేతగా అసెంబ్లీలో వినిపిస్తానని విక్రమార్క పేర్కొన్నారు.
CLP