తెలంగాణ

telangana

ETV Bharat / state

ఇంటర్ బాధితుల కోసం అఖిలపక్షం భిక్షాటన

ఇంటర్ బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు అఖిలపక్ష నేతలు నడుం బిగించారు. విద్యార్థి, యువజన, ప్రజాసంఘాలతో కలిసి భిక్షాటన చేయాలని నిర్ణయించారు. పసి మొగ్గలు చనిపోతుంటే ప్రభుత్వం స్పందించకపోవటం సిగ్గుచేటన్నారు.

By

Published : Jun 21, 2019, 7:03 AM IST

Updated : Jun 21, 2019, 7:49 AM IST

ఇంటర్ బాధితుల కోసం అఖిలపక్షం భిక్షాటన

ఇంటర్మీడియట్ బోర్డు బాధిత కుంటుంబాలను ఆదుకునేందుకు అఖిలపక్షం నేతలు ఈ నెల 29న భిక్షాటన చేయనున్నట్లు ప్రకటించారు. విద్యార్థి, యువజన, ప్రజాసంఘాలతో కలిసి చార్మినార్ నుంచి ఇంటర్ బోర్డు కార్యాలయం వరకు భిక్షాటన చేయనున్నట్లు తెలిపారు. హైకోర్టు తీర్పుపై భవిష్యత్ కార్యచరణను చర్చించేందుకు అఖిపక్ష నేతలు సీపీఐ రాష్ట్ర కార్యాలయం మఖ్ధూం భవన్​లో సమావేశమయ్యారు. ఇంటర్ వ్యవహారంపై సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నట్లు స్పష్టం చేశారు. విద్యార్థులు చనిపోతే ముఖ్యంత్రికి చీమ కుట్టినట్లైనా లేదని విమర్శించారు.

ఇంటర్ బాధితుల కోసం అఖిలపక్షం భిక్షాటన
Last Updated : Jun 21, 2019, 7:49 AM IST

ABOUT THE AUTHOR

...view details