ఇంటర్లో ఫెయిలై ఆత్మహత్య చేసుకున్న ప్రతి విద్యార్థి కుటుంబానికి కోటి రూపాయల పరిహారం ఇవ్వాలని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ డిమాండ్ చేశారు. ఇందిరాపార్క్ వద్ద అఖిలపక్ష భేటీకి విపక్ష నేతలు హాజరయ్యారు. విద్యాశాఖ మంత్రిని వెంటనే ఎందుకు తొలగించలేదని నారాయణ ప్రశ్నించారు. విద్యార్థుల ఆత్మహత్యలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని తెతెదేపా అధ్యక్షుడు ఎల్. రమణ డిమాండ్ చేశారు.
ఇంటర్ మృతులకు కోటి రూపాయలు ఇవ్వాలి: నారాయణ
ఇంటర్ ఫలితాల్లో అవకతవకలకు నిరసనగా... అఖిలపక్షం ఇందిరా పార్కు వద్ద ధర్నాకు దిగింది. బోర్డు నిర్లక్ష్యానికి బలైన విద్యార్థుల కుటుంబాలకు ప్రభుత్వం న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
కోటి రూపాయలు ఇవ్వాలి: నారాయణ
Last Updated : May 11, 2019, 1:59 PM IST