భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం సిద్దారం పరిధిలోని పోడు భూముల్లో అటవీశాఖ ఆధ్వర్యంలోని కందకం పనులను జడ్పీ ఛైర్మన్ కోరం కనకయ్య అడ్డుకున్నారు. పోడు సమస్యను ముఖ్యమంత్రి పరిష్కరిస్తానని చెబుతున్నప్పటికీ అటవీ సిబ్బంది అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని ఆరోపించారు.
40 ఏళ్ల నుంచి పోడు భూముల్లో వ్యవసాయం చేసుకుంటున్న ఆదివాసీలను ఇబ్బందులు పెడుతున్నారని, మా నాన్నగారు సైతం ఈ ప్రాంతంలో వ్యవసాయం చేశారని కోరం కనకయ్య అన్నారు. కందకం పనులకొచ్చిన అటవీశాఖ అధికారి డీఆర్ఓ నరేశ్తో మాట్లాడారు. ముఖ్యమంత్రి నిర్ణయం వచ్చేవరకు ఆగాలని సూచించారు.
బెదిరించడం ఏంటి..?
తాము గూగుల్ ఎర్త్ పటం ప్రకారం వచ్చామని 45 ఎకరాలు కావాలని, పోడు రైతులను కోరామని, 30 ఎకరాలు ఇస్తామన్నారని అటవీశాఖ అధికారి అన్నారు. మీరు కందకం పనుల కోసం వచ్చి బెదిరించడం ఏంటి..? 45 ఎకరాలు, 30 ఎకరాలంటూ వాటాలు అంటున్నారని అటవీ సిబ్బందిని ప్రశ్నించారు.