తెలంగాణ

telangana

ETV Bharat / state

పేదలకు అండగా నిలుస్తోన్న మిర్చి బండి అబ్బాయి - LOCK DOWN EFFECTS

చేసేది వేలకు వేలు వచ్చే ఉద్యోగం కాదు... అలాగని ఆస్తులూ ఏమీ లేవు... బ్యాక్​గ్రౌండ్​ కూడా లేదు.. బస్టాండ్​ సెంటర్​లో మిర్చిలు అమ్ముకుంటాడు. అయినా... తన సమాజ సేవ చేయాలన్న తన తపనకు ఇవేవి అడ్డు కాదు.. ప్రస్తుత లాక్​డౌన్​ పరిస్థితిలో తనకున్నంతలో నిరుపేదలకు సాయమందిస్తూ... ఆదర్శంగా నిలుస్తున్నాడు ఇల్లందు యువకుడు.

YOUNG BOY HELPING TO POOR AND NEEDY PEOPLE IN ILLANDHU
పేదలకు అండగా నిలుస్తోన్న మిర్చి బండి అబ్బాయి

By

Published : May 1, 2020, 1:26 PM IST

లాక్​డౌన్ సమయంలో నిరుపేదలకు వికలాంగులకు తనవంతు సాయం చేస్తూ... అండగా నిలుస్తున్నాడు సలీం అనే యువకుడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందుకు చెందిన సలీం... కొత్త బస్టాండ్ సెంటర్​లో మిర్చి బండి నిర్వహిస్తుంటాడు. సలీం సహజంగానే సమాజ సేవకుడిగా పలువురికి సాయం చేస్తుంటాడు.

లాక్​డౌన్ కారణంగా పలువురు ఇబ్బందులు పడుతున్న విషయాన్ని గ్రహించిన సలీం... తన మిత్రులతో కలిసి వికలాంగులు, ఆటో డ్రైవర్లు, వ్యాధితో ఇబ్బంది పడుతున్న వారికి, వృద్ధులకు భోజనం అందిస్తూ అండగా నిలుస్తున్నాడు. కష్టకాలంలో ఇబ్బందులు పడుతున్న వారికి తనకు తోచిన సాయాన్ని చేస్తున్నట్టు సలీం తెలిపాడు. మనుషులకే కాదు... తిండిలేక దీనంగా చూస్తోన్న కోతులకు సైతం తినుబండారాలు అందిస్తున్నాడు.

పేదలకు అండగా నిలుస్తోన్న మిర్చి బండి అబ్బాయి
పేదలకు అండగా నిలుస్తోన్న మిర్చి బండి అబ్బాయి
పేదలకు అండగా నిలుస్తోన్న మిర్చి బండి అబ్బాయి

ఇదీ చూడండి:పెట్టుబడుల ఆకర్షణపై దృష్టి సారించండి : మోదీ

ABOUT THE AUTHOR

...view details