భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాకర్లలోని శ్రీ శ్రీ రుక్మిణీ సమేత సంతాన వేణుగోపాలస్వామి ఆలయ పునః నిర్మాణానికి వైరా ఎమ్మెల్యే రాములు నాయక్ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ నాగభూషణం పాల్గొన్నారు.
సంతాన వేణుగోపాలస్వామి ఆలయ పునః నిర్మాణానికి శంకుస్థాపన - vaira mla update
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాకర్లలోని శ్రీ శ్రీ రుక్మిణీ సమేత సంతాన వేణుగోపాలస్వామి ఆలయ శంకుస్థాపన మహోత్సవం ఘనంగా జరిగింది. ఎమ్మెల్యే రాములు నాయక్ ఈ కార్యక్రామానికి ముఖ్య అతిథిగా హాజరై.. ఆలయ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.

ఆలయ పున:నిర్మాణానికి వైరా ఎమ్మెల్యే శంకుస్థాపన
ఆలయ పున:నిర్మాణం
నూతన హంగులతో నిర్మాణం చేపట్టనున్న ఆలయానికి వేదపండితులు.. మంత్రోచ్ఛారణలతో భూమి పూజను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు కాకర్లతో పాటు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
ఇదీ చదవండి:కాలభైరవ ఆలయానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే
Last Updated : Dec 29, 2020, 8:11 PM IST