సింగరేణి నిర్వాసితుల కాలనీ వాసులకు స్థానిక కూరగాయల వ్యాపారి నిత్యావసర సరకులు, కూరగాయలు పంపిణీ చేశాడు. లాక్డౌన్ వల్ల ఉపాధి లేక ఆర్థికంగా సతమతమతున్న సింగరేణి నిర్వాసితుల కాలనీలోని పేదలకు కూరగాయల వ్యాపారి హరి కృష్ణ, జిల్లా గ్రంథాలయ ఛైర్మన్ దిండిగాల రాజేందర్, సీఐ వేణు చందర్ ఆధ్వర్యంలో కూరగాయల పంపిణీ చేశారు.
సింగరేణి నిర్వాసితులకు కూరగాయల పంపిణీ - భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తాజా వార్తలు
లాక్డౌన్ కారణంగా ఉపాధిలేక ఇబ్బందిపడుతున్న వారికి పలువురు దాతలు కూరగాయలు పంపిణీ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులోని సింగరేణి నిర్వాసిత కాలనీ వాసులకు.. కూరగాయల వ్యాపారి హరికృష్ణ తన వంతు సాయంగా కూరగాయలు అందజేశాడు.
![సింగరేణి నిర్వాసితులకు కూరగాయల పంపిణీ vegetable merchant who distributes vegetables to the singareni colony](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6623012-thumbnail-3x2-veg-rk.jpg)
సింగరేణి నిర్వాసితులకు కూరగాయల పంపిణీ
ప్రజలందరూ తమవంతు బాధ్యతగా కష్టకాలంలో ఇబ్బంది పడుతున్న పేదలను ఆదుకునేందుకు చేతనైన సాయం చేయాలని దాతలు సూచిస్తున్నారు.
సింగరేణి నిర్వాసితులకు కూరగాయల పంపిణీ
ఇవీ చూడండి:కరోనా గురించి అంతుచిక్కని 5 రహస్యాలివే..