తెలంగాణ

telangana

ETV Bharat / state

'దేశంలో ఎక్కడా లేని సంక్షేమ పథకాలు తెరాస ప్రవేశపెట్టింది' - Bhadradri Kothagudem District Latest News

భద్రాచలంలో తెరాస ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి పర్యటించారు. కళాశాలల, పాఠశాలల అధ్యాపకులను, న్యాయవాదులను కలిసి ఓటు వేయాలని కోరారు. నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు.

Trs MLC candidate Palla Rajeshwar Reddy visited In Bhadrachalam
భద్రాచలంలో పల్లా రాజేశ్వర్ రెడ్డి పర్యటన

By

Published : Mar 6, 2021, 6:49 PM IST

దేశంలో ఎక్కడా లేని అభివృద్ధి పథకాలు తెరాస ప్రభుత్వం ప్రవేశపెట్టి అమలు చేస్తోందని ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. ఇతర రాష్ట్రాల్లో ఎవరిని అడిగినా ఆ విషయం తెలుస్తుందని పేర్కొన్నారు. కేసీఆర్​ సర్కారు అధికారంలోకి వచ్చాక ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చిందన్నారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో పల్లా పర్యటించారు. కళాశాలల, పాఠశాలల అధ్యాపకులను, న్యాయవాదులను కలిసి ఓటు వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవిత, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, జడ్పీ ఛైర్మన్ కోరం కనకయ్య, తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి:తెలంగాణ ఉద్యమ తరహాలో పోరాడుతాం: వినయ్​భాస్కర్​

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details