తెలంగాణ

telangana

ETV Bharat / state

భద్రాద్రిలో నామ ఎన్నికల ప్రచారం

భద్రాద్రి జిల్లాల్లో తెరాస నాయకుల ప్రచారం జోరందుకుంది. 16 ఎంపీ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా నేతలు విస్తృతంగా పర్యటిస్తున్నారు. భద్రాద్రిలో నామ నాగేశ్వరరావు ప్రచారం నిర్వహించారు. ఎంపీగా గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

By

Published : Mar 30, 2019, 5:04 PM IST

ఎన్నికల ప్రచారం

ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మాజీ మంత్రి తుమ్మల, నామ నాగేశ్వరరావు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఖమ్మం తెరాస పార్లమెంట్​ అభ్యర్థి నామ నాగేశ్వరరావు ప్రచారం నిర్వహించారు. అశ్వారావుపేట పట్టణంలో కార్యకర్తలతో భారీ ర్యాలీ చేశారు. కార్యక్రమంలో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో మాదిరిగానే పార్లమెంటు ఎన్నికల్లోనూ తెరాసను ఆదరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

నమ్మకాన్ని నిలబెట్టుకుంటా..

ముఖ్యమంత్రి కేసీఆర్​ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని నామ నాగేశ్వరరావు అన్నారు. తనను గెలిపించి సీఎంకు బహుమతిగా ఇవ్వాలని ప్రజలను కోరారు.

ఇదీ చదవండి :కన్నడ యువత పెళ్లిళ్లకు 'చెత్త' సమస్య

ABOUT THE AUTHOR

...view details