తెలంగాణ

telangana

ETV Bharat / state

పెరిగిన ట్రాఫిక్ జరిమానాలపై అవగాహన

దేశవ్యాప్తంగా ట్రాఫిక్ నిబంధనలు పాటించని వారిపై ప్రభుత్వం విధించే జరిమానాలు నాలుగు నుంచి ఐదు రెట్లు పెరిగినట్లు భద్రాచలం ఏఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు.

By

Published : Aug 17, 2019, 3:08 PM IST

పెరిగిన ట్రాఫిక్ జరిమానాలపై అవగాహన

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో ఆటో డ్రైవర్లకు పెరిగిన జరిమానాలపై భద్రాచలం ఏఎస్పీ రాజేష్ చంద్ర అవగాహన కల్పించారు. హెల్మెట్ లేకుండా వాహనం నడిపిన మైనర్లకు, లైసెన్స్​ లేని వాహనాలకు, ఆటోలపై విధించే జరిమానాలు నాలుగు నుంచి ఐదు రెట్లు పెరిగాయని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరు విధిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోతే భారీ జరిమానాతో పాటు జైలు శిక్ష కూడా పడుతుందన్నారు. ఈ అవగాహన సదస్సులో సీఐ సత్యనారాయణ రెడ్డి, ఎస్ఐలు రాంబాబు, శ్రీనివాస్ పాల్గొన్నారు.

పెరిగిన ట్రాఫిక్ జరిమానాలపై అవగాహన

ABOUT THE AUTHOR

...view details