రాహుల్ గాంధీ సభకు వెళ్తుండగా ట్రాక్టర్ బోల్తా - ఒకరు మృతి - Road accident in Bhadradri Kothagudem district

Published : Nov 17, 2023, 11:41 AM IST
|Updated : Nov 17, 2023, 12:04 PM IST
11:36 November 17
కల్యాణపురం వద్ద ట్రాక్టర్ బోల్తా - ఒకరు మృతి
Tractor Accident in Kothagudem Today : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కల్యాణపురం వద్ద ట్రాక్టర్ అదుపుతప్పి (Tractor Accident) బోల్తా పడింది. ఈ ఘటనలో సోడెం వెంకటేశ్వర్లు అనే వ్యక్తి అక్కడిక్కడే మృతి చెందాడు. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండగా.. మరో 20 మందికి గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో ట్రాక్టర్లో 30 మంది ప్రయాణిస్తున్నారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను మణుగూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మణుగూరులో రాహుల్ గాంధీ సభకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు.