తెలంగాణ

telangana

ETV Bharat / state

సోలార్ కేంద్రం పనులు త్వరగా పూర్తి చేయాలని ఆదేశం - సింగరేణి ఆధ్వర్యంలో ఇల్లందులో సోలార్​ ప్లాంట్​

ఇల్లందులో సింగరేణి ఆధ్వర్యంలో నిర్మిస్తున్న సోలార్ విద్యుత్ కేంద్రం పనులను అధికారుల బృందం పరిశీలించింది. పెండింగ్​లో ఉన్న పనులను త్వరగా పూర్తి చేయాలని గుత్తేదారులను అధికారులు ఆదేశించారు. త్వరలో 39 మెగావాట్ల సోలార్ విద్యుత్ పనులను పూర్తి చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

The solar center was ordered to complete the tasks quickly at yellandu
సోలార్ కేంద్రం పనులు త్వరగా పూర్తి చేయాలని ఆదేశం

By

Published : Sep 30, 2020, 9:36 AM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో 39 మెగావాట్ల సోలార్ విద్యుత్ కేంద్ర పనులను ఈఎమ్​డీ డైరెక్టర్ సత్యనారాయణ, అధికారుల బృందం పరిశీలించింది. కొవిడ్ కారణంగా పనులు ఆలస్యం అయినప్పటికీ.. పూర్తి కాకుండా ఉన్న పనుల జాప్యంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. త్వరగా పూర్తి చేయాలని గుత్తేదారులకు సూచించారు.

సింగరేణి సంస్థలో మొదటి విభాగంలో 129 మెగావాట్ల విద్యుత్తు కోసం రామగుండంలో 50, మణుగూరులో 30, సత్తుపల్లిలో 10, ఇల్లందులో 39 మెగావాట్ల సోలార్ విద్యుత్తు కోసం 220 హెక్టార్ల స్థలంలో పనులు జరుగుతున్నాయని ఆయన అన్నారు. మరో నెల రోజుల్లో ఆ పనులు పూర్తవుతాయని తెలిపారు. ఆ ప్రాజెక్టులు పూర్తైతే సింగరేణి సంస్థకు ఖర్చులు తగ్గుతాయని.. రాష్ట్రం విద్యుత్ ఉత్పత్తి మరింత మెరుగుదల సాధిస్తుందని ఈఎమ్​డీ డైరెక్టర్ పేర్కొన్నారు.

ఇదీ చూడండి :ఆ ఆలయాలకు పాలకవర్గ నియామకం లేదు

ABOUT THE AUTHOR

...view details