అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవాన్ని గ్రామగ్రామాన జరుపుకోవాలని మావోయిస్టులు పేర్కొన్నారు. స్త్రీలపై జరుగుతున్న అన్ని రకాల దాడులు వ్యతిరేకించడమే లక్ష్యంగా ఉద్యమించాలని సూచించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో శబరి ఏరియా కార్యదర్శి అరుణ పేరుతో కరపత్రాలు విడుదల చేశారు.
శ్రామిక మహిళా దినోత్సవం జరుపుకోవాలని మావోయిస్టుల లేఖ - Bhadradri Kothagudem District Latest News.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో మావోయిస్టులు కరపత్రాలు విడుదల చేశారు. అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవం జరుపుకోవాలని సూచించారు. ప్రపంచ సోషలిస్టు విప్లవం వర్ధిల్లాలని లేఖలో పేర్కొన్నారు.
![శ్రామిక మహిళా దినోత్సవం జరుపుకోవాలని మావోయిస్టుల లేఖ The Maoists released pamphlets in the Charla mandal](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10911179-283-10911179-1615128508464.jpg)
శ్రామిక మహిళా దినోత్సవం జరుపుకోవాలని మావోయిస్టుల లేఖ
సామ్రాజ్యవాద విష సంస్కృతి, బ్రాహ్మణీయ హిందుత్వ సమాజానికి వ్యతిరేకంగా పోరాడాలని లేఖలో తెలిపారు. ప్రపంచ సోషలిస్టు విప్లవం వర్ధిల్లాలని కరపత్రాల్లో పేర్కొన్నారు.