తెలంగాణ

telangana

By

Published : Jan 9, 2021, 11:23 PM IST

ETV Bharat / state

'సంక్షేమ పథకాల అమలు ఘనత తెదేపాకే దక్కింది'

సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన ఘనత స్వర్గీయ నందమూరి తారక రామారావుకు దక్కిందని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ అన్నారు. సాంకేతిక అభివృద్ధిలో చంద్రబాబు నాయుడు తనదైన ముద్ర వేశారని కొనియాడారు. ఇల్లందు నియోజకవర్గంలో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు.

L. Ramana speaking after opening the TDP office at illandu
ఇల్లందులో తెదేపా కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం మాట్లాడుతున్న ఎల్.రమణ

సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన ఘనత తెలుగుదేశానికి, స్వర్గీయ నందమూరి తారక రామారావుకు దక్కిందని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ అన్నారు. సాంకేతిక అభివృద్ధి పరంగా పాలనలో చంద్రబాబు నాయుడు తనదైన ముద్ర వేశారని కొనియాడారు.

అండగా ఉంటా..

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు నియోజకవర్గంలో తెదేపా కార్యాలయాన్ని పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు, అశ్వారావుపేట ఎమ్మెల్యే నాగేశ్వరరావుతో కలిసి రమణ ప్రారంభించారు. పార్టీ కార్యకర్తలకు ఏ కష్టం వచ్చినా ఎల్లప్పుడూ అండగా ఉంటామని తెలిపారు.

అధికారం ఉన్నా లేకపోయినా ప్రజా సమస్యలపై నిత్యం పోరాటం చేస్తామని పేర్కొన్నారు. ఇల్లందులో పార్టీ శ్రేణులతో బైక్ ర్యాలీ నిర్వహించారు.

నీళ్లు, నిధులు, నియామకాల పేరిట రెండోసారి ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారంలోకి వచ్చారు. ప్రాంతాలు, మతాల పేరిట కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి రావాలని చూస్తోంది. - ఎల్. రమణ.

ఇదీ చూడండి:వరంగల్​ మేయర్​ పీఠమే లక్ష్యం: బండి సంజయ్

ABOUT THE AUTHOR

...view details