కొవిడ్ విజృంభణ నేపథ్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండల అధికారులు అప్రమత్తమయ్యారు. ఎంపీపీ శ్రీరామ్ మూర్తి.. గ్రామాల్లో సోడియం హైపోక్లోరైట్ ద్రావణాన్ని పిచికారీ చేయించారు. వీధుల్లో.. పారిశుద్ధ్య పనులు చేయించి, బ్లీచింగ్ పౌడర్ చల్లించారు.
అశ్వారావుపేటలో కరోనా నివారణ చర్యలు - అశ్వారావుపేటలో కరోనా కేసులు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో కొవిడ్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మండల అధికారులు అప్రమత్తమయ్యారు. గ్రామాల్లో వైరస్ కట్టడికి చర్యలు చేపట్టారు.
![అశ్వారావుపేటలో కరోనా నివారణ చర్యలు ashwarao peta covid cases](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-06:10:37:1619613637-tg-kmm-06-28-petalo-corona-nivarana-charyalu-ts10088-28042021174508-2804f-1619612108-866.jpg)
ashwarao peta covid cases
ప్రజలందరూ కొవిడ్ నిబంధనలు పాటించాల్సిందిగా ఎంపీపీ సూచించారు. కరోనా కట్టడికి అంతా సహకరించాలని ఆయన కోరారు. మండలంలో ఇప్పటికే సుమారు 350 మందికి పైగా కరోనా బారిన పడ్డారు. ఐదుగురు మహమ్మారి ధాటికి బలయ్యారు.