తెలంగాణ

telangana

ETV Bharat / state

వేసవి శిక్షణ శిబిరాలు.. తెచ్చాయి సరదాలు

రాష్ట్రవ్యాప్తంగా భానుడు సెగతో హడలెస్తున్నాడు. ఏడాది పొడవునా చదువులతో కుస్తీ పట్టిన పిల్లలకు వేసవి ఆనందాన్ని తీసుకొచ్చింది. ఒకప్పుడు సెలవులొచ్చాయంటే పెట్టే బేడా సర్దుకుని చుట్టాలింటికి చెక్కేసేవారు. కాని నేటితరం పిల్లలు  ప్రతి క్షణాన్ని సద్వినియోగం చేసుకోవాలనుకుంటున్నారు. అలాంటి వారికోసమే సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో భద్రాద్రి జిల్లా కొత్తగూడెం జిల్లా మణుగూరులో వేసవి శిక్షణ శిబిరం ఏర్పాటు చేసింది.

By

Published : May 10, 2019, 2:40 PM IST

summer-camp

వినోదంతో పాటు నచ్చిన క్రీడలో శిక్షణనిస్తూ వేసవి సెలవులను సద్వినియోగం చేసుకునేలా సింగరేణి సంస్థ వేసవి శిబిరం ఏర్పాటు చేసింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గం మణుగూరులో కొన్ని రోజుల కిందట ఈ క్రీడా శిక్షణ శిబిరం ప్రారంభించారు. అనతి కాలంలోనే విద్యార్థుల నుంచి అనూహ్య స్పందన వచ్చింది.

నచ్చిన ఆటలో పట్టు సాధిస్తూ..

సెలవుల్ని సద్వినియోగం చేసుకుంటూ... తమకిష్టమైన ఆటలో పట్టు సాధించేందుకు పిల్లలు మైదానం బాట పట్టారు. నిత్యం సుమారు 150 మందికి పైగా చిన్నారులు శిక్షకుల ఆధ్వర్యంలో పలు క్రీడల్లో మెలకువలు నేర్చుకుంటున్నారు. స్థానికులతో పాటు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారు కూడా శిబిరంలో పాల్గొంటున్నారు. విద్యార్థుల్లో స్ఫూర్తి నింపేందుకు ఏకరూప దుస్తులు పంపిణి చేశారు. ఆటపాటలతో అలసిన చిన్నారులకు అల్పాహారం అందిస్తున్నారు.

ఫుట్​బాల్​, వాలీబాల్​, బాస్కెట్​బాల్​తో పాటు కరాటే, అథ్లెటిక్స్​లో శిక్షణనిస్తున్నారు. ఈ వేసవి శిబిరం నిర్వాహకులను తల్లిదండ్రులు అభినందిస్తున్నారు.

వేసవి శిక్షణ శిబిరాలు.. తెచ్చాయి సరదాలు

ఇదీ చదవండి: ఓరుగల్లును హడలెత్తిన్న భానుడు

ABOUT THE AUTHOR

...view details