భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అటవీ ప్రాంతంలో జరిగిన కాల్పుల్లో ఒక మావోయిస్టు చనిపోయినట్లు... ఎస్పీ సునీల్దత్ వెల్లడించారు. మూడు రోజులుగా దుబ్బగూడెం, దేవుళ్లగూడెం, గంగారం ప్రాంతాల్లో మావోయిస్టులు సంచరిస్తున్నారనే సమాచారంతో తనిఖీలు చేపట్టామని పేర్కొన్నారు.
ఎదురుకాల్పుల్లో ఒకరు మృతి.. మరొకరు పరారీ: ఎస్పీ - భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎన్కౌంటర్
దేవళ్లగూడెం ఎన్కౌంటర్ ప్రాంతాన్ని ఎస్పీ సునీల్ దత్ పరిశీలించారు. జిల్లాలో చాలాకాలంగా మావోయిస్టుల కదలికలపై సమాచారం ఉందని తెలిపారు. మావో బృందాలు సంచరిస్తున్నాయన్న సమాచారంతో నిఘా పెంచామని చెప్పారు.
![ఎదురుకాల్పుల్లో ఒకరు మృతి.. మరొకరు పరారీ: ఎస్పీ SP Sunil Dutt inspected the Devallagudem encounter area AT Bhadradri Kottagudem District](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8662469-185-8662469-1599122104030.jpg)
ఎదురుకాల్పుల్లో ఒక వ్యక్తి మృతి.. మరొకరు పరారీ: ఎస్పీ
తెల్లవారుజామున 4గంటలకు తనిఖీలు చేస్తుండగా ఇద్దరు వ్యక్తులు పోలీసులను చూసి పారిపోయారన్న ఆయన... వారిని వెంబడించగా కాల్పులు జరిపినట్లు పేర్కొన్నారు. ఎదురు కాల్పుల్లో ఒక మావోయిస్టు చనిపోయినట్లు స్పష్టం చేశారు. మరొకరు పరారీలో ఉన్నట్లు వెల్లడించారు.
ఇదీ చూడండి:భద్రాద్రి జిల్లాలో ఎదురు కాల్పులు.. మావోయిస్టు మృతి