భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు నియోజకవర్గ పరిధిలోని బేతంపూడి సహకార సంఘంలో వ్యవసాయ అప్పు ఉన్న రైతులకు బ్యాంకు ప్రాంగణంలో అధిక వడ్డీకి డబ్బులు ఇస్తున్నాడన్న అనుమానంతో ఒక వ్యక్తిపై సొసైటీ కార్యదర్శి ప్రేమాచారి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
బొమ్మనపల్లి కొత్త తండాకు చెందిన నరేష్ అనే వ్యక్తి బ్యాంకు ప్రాంగణంలో లక్షన్నర రూపాయలు ఏడు పాసు పుస్తకాలతో ఉండడాన్ని సొసైటీ ఛైర్మన్, డీసీసీబీ డైరెక్టర్, మరికొందరు గమనించారు. అతని వద్ద ఉన్న పాసుపుస్తకాలు, డబ్బుల విషయమై నిలదీశారు. అనుమానం వచ్చి స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు.