తెలంగాణ

telangana

ETV Bharat / state

గోదావరిలో స్వల్పంగా పెరిగిన నీటిమట్టం - జలకళ సంతరించుకున్న గోదావరి

నీరు లేకుండా కళావిహీనంగా మారిన గోదావరి నేడు జలకళను సంతరించుకుంది. ఇసుక దిబ్బలతో దర్శనమిచ్చిన జీవనది నేడు పెరిగిన నీటి మట్టంతో చూపరులను ఆకట్టుకుంటోంది.

Godavari with water bodies
జలకళ సంతరించుకున్న గోదావరి

By

Published : Jun 20, 2021, 5:42 PM IST

గోదావరి నీటిమట్టం స్వల్పంగా పెరిగింది. మొన్నటివరకు నీరు లేక ఇసుక దిబ్బలతో దర్శనమిచ్చిన జీవనది నేడు జలకళను సంతరించుకుంది. శనివారం 4 అడుగులకు పరిమితమైన నీటి మట్టం.. ఆదివారం ఉదయానికి 9 అడుగులకు చేరుకుంది.

జలకళ సంతరించుకున్న గోదావరి

ఎగువ ప్రాంతాల్లో ఉన్న లక్ష్మి బ్యారేజీ నుంచి నీటిని దిగువకు విడుదల చేయడం వల్లే గోదావరిలో నీటి మట్టం పెరిగిందని అధికారులు తెలిపారు. ఈ ఏడాది కూడా భద్రాచలం ప్రాంతానికి వరద ముప్పు ఎక్కువగానే ఉంటుందన్న అధికారుల హెచ్చరికలతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు.

ఇదీ చదవండి:Cm Kcr: నా కళ్లల్లో ఆనంద భాష్పాలు వస్తున్నాయ్..

ABOUT THE AUTHOR

...view details