ఆర్టీసీ ఉద్యోగుల ధర్నా.. స్పృహ తప్పిన ఆందోళనకారుడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో ఆర్టీసీ ఉద్యోగులు డిపో ఎదుట రెండుగంటలపాటు ధర్నా నిర్వహించారు. బ్రిడ్జి సెంటర్ నుంచి అంబేడ్కర్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం డిపో నుంచి బస్సులను బయటకు రానీయకుండా అడ్డుకున్నారు. దీనితో భద్రాచలం ఏఎస్పీ రాజేశ్ చంద్ర డిపో వద్దకు వచ్చి ఉద్యోగులను ధర్నా నుంచి పైకి లేపారు. అనంతరం పోలీసులకు ఆర్టీసీ ఉద్యోగులకు వామపక్షాలకు మద్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఘర్షణలో ఒకరు స్పృహ తప్పి పడిపోయారు.