తెలంగాణ

telangana

ETV Bharat / state

మోదుగులగూడెం వద్ద రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతిచెందిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పరిధి మోదుగులగూడెం వద్ద చోటు చేసుకుంది.

By

Published : May 10, 2020, 7:28 PM IST

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకుల మృతి
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకుల మృతి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం మోదుగులగూడెం వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ద్విచక్ర వాహనం, బొలెరో వాహనం ఢీకొన్న ఘటనలో కొల్లాపురానికి చెందిన ఇద్దరు యువకులు మృతి చెందారు.

వేగంగా వచ్చి ఢీకొట్టిన బొలెరో...

యువకులు ఇల్లందు నుంచి ద్విచక్రవాహనంపై తమ స్వగ్రామం కొల్లాపురం వెళ్తుండగా కొత్తగూడెం నుంచి ఇల్లందు వస్తున్న బొలెరో వాహనం బలంగా ఢీకొట్టింది. అక్కడికక్కడే ఒకరు మృతి చెందగా మరొకరు ఖమ్మం ఆస్పత్రికి తరలిస్తుండగా మరణించారు. మృతులను నవీన్, చీమల కిట్టుగా గుర్తించారు.

ఇవీ చూడండి : దేశంలో ఒక్కరోజే మరో 128 కరోనా మరణాలు

ABOUT THE AUTHOR

...view details