తెలంగాణ

telangana

Missing: క్షుద్రపూజల కలకలం.. వ్యక్తి అదృశ్యం

By

Published : Jun 10, 2021, 6:06 PM IST

Updated : Jun 10, 2021, 9:57 PM IST

క్షుద్రపూజలు కలకలం రేపాయి. వరంగల్ గ్రామీణ జిల్లా చెన్నారావుపేట మండలం ఉప్పరపల్లిలో ఓ ఇంటిముందు ఆనవాళ్లు కనిపించాయి. ఈ సంఘటనతో బయటే పడుకున్న వ్యక్తి అదృశ్యమైపోయాడు.

One person missing in upparapalli v
వరంగల్ గ్రామీణ జిల్లాలో క్షుద్రపూజల కలకలం

వరంగల్ గ్రామీణ జిల్లా చెన్నారావుపేట మండలం ఉప్పరపల్లి గ్రామంలో క్షుద్ర పూజలు కలకలం రేపాయి. గ్రామానికి చెందిన చీమల సతీశ్​ అనే వ్యక్తి ఇంటిముందు ముగ్గుతో బొమ్మను గీసి, పసుపు, కుంకుమ, నిమ్మకాయలు పెట్టిన ఆనవాళ్లు కనిపించాయి. ఈ సంఘటనతో ఇంటి బయట పడుకున్న సతీశ్ కనిపించకుండా పోయాడు.

గతకొన్ని రోజులుగా సతీశ్ భార్య, పిల్లలతో కలిసి రాయపర్తి గ్రామంలోని తన తల్లి ఇంటివద్దే ఉంటోంది. దీంతో సతీశ్ ఒక్కడే ఇంటిదగ్గర ఉంటున్నాడు. ఈ నేపథ్యంలో అతను అదృశ్యం కావడం గ్రామంలో చర్చకు దారితీసింది. ఆయన ఇంటిముందు తానే క్షుద్రపూజలు చేశాడా.. లేదా మరెవరైనా సతీశ్​ను ఏమైనా చేసి ఉంటారా అని గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.

ఇదీ చూడండి: KTR RESPOND:ఈటీవీ భారత్​ కథనానికి స్పందన... ఆ చిన్నారులకు కేటీఆర్ ఆపన్నహస్తం

Last Updated : Jun 10, 2021, 9:57 PM IST

ABOUT THE AUTHOR

...view details