తెలంగాణ

telangana

వైకుంఠధామం నిర్మాణంలో అపశ్రుతి.. ట్రాక్టర్ బోల్తా పడి వ్యక్తికి గాయాలు

By

Published : Jul 19, 2020, 5:06 PM IST

వైకుంఠధామం నిర్మాణంలో భాగంగా వినియోగిస్తున్న ట్రాక్టర్​ ట్యాంకర్​ బోల్తాపడి ఓ వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం మసివాగు గ్రామపంచాయతీలో చోటుచేసుకుంది.

one man injured in tractor accident at masivagu village
one man injured in tractor accident at masivagu village

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం మసివాగు గ్రామపంచాయతీ పరిధిలో చేపట్టిన వైకుంఠధామం నిర్మాణంలో అపశ్రుతి చోటు చేసుకుంది. నిర్మాణంలో వినియోగిస్తున్న ట్రాక్టర్ ట్యాంకర్ ఒక్కసారిగా బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ తారాచంద్​కు తీవ్ర గాయాలయ్యాయి. కాగా... క్షతగాత్రున్ని ఇల్లందు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం ఖమ్మం తీసుకెళ్లారు.

ఇదీ చూడండి:బీసీజీ టీకా కరోనా నుంచి రక్షిస్తుందా?

ABOUT THE AUTHOR

...view details