తెలంగాణ

telangana

ETV Bharat / state

కానిస్టేబుల్ భార్యను పరామర్శించిన ఎంపీ, ఎమ్మెల్యే

ఇటీవలే అనారోగ్యంతో మృతి చెందిన కానిస్టేబుల్ భార్య, ఇల్లందు జడ్పీటీసీ ఉమాదేవిని ఎంపీ కవిత, ఎమ్మెల్యే హరిప్రియలు పరామర్శించారు.

By

Published : Apr 20, 2020, 4:09 PM IST

mla and mp criticized zptc umadevi
కానిస్టేబుల్ భార్యను పరామర్శించిన ఎంపీ, ఎమ్మెల్యే

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు జడ్పీటీసీ వాంకుడోత్ ఉమాదేవి నివాసానికి వెళ్లి మహబూబాబాద్ పార్లమెంటు సభ్యురాలు కవిత, ఇల్లందు శాసనసభ్యురాలు హరిప్రియ పరామర్శించారు. ఇల్లందులో కానిస్టేబుల్​గా విధులు నిర్వహించే ఆమె భర్త ఇటీవల అనారోగ్యంతో మరణించారు.

ఈ విషయంపైనే ఉమాదేవిని పరామర్శించేందుకు ఆమె ఇంటికి వెళ్లారు. వీళ్లతోపాటు గ్రంథాలయ ఛైర్మన్ దిండిగాల రాజేందర్, మున్సిపల్ ఛైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వర్లు, వైస్ ఛైర్మన్ జానీ, తెరాస నాయకురాలు ఖమ్మం పాటి రేణుక పాల్గొన్నారు.

ఇవీ చూడండి:రాష్ట్రంలో కరోనా కలవరం... 858కి చేరిన కేసులు

ABOUT THE AUTHOR

...view details