లాక్డౌన్ కాలంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణ ప్రజలకు కొందరు వ్యాపారులు చేయూత ఇవ్వడం అభినందనీయమని ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ అన్నారు. పట్టణంలోని నాల్గవ వార్డులో పేదలకు నిత్యావసరాలు, కూరగాయలు పంపిణీ చేశారు.
సరకులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే హరిప్రియ - mla haripriya naik distributed food at yellandu
ఇల్లందు పట్టణం నాల్గవ వార్డు ప్రజలకు ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ కూరగాయలు, నిత్యావసర సరకులు పంపిణీ చేశారు. పేదలను ఆదుకోవడానికి దాతలు ముందుకు రావడం అభినందనీయమన్నారు.

సరకులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే హరిప్రియ
ఈ విపత్కర పరిస్థితుల్లో పోలీసు, వైద్య సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికుల సేవలకు సెల్యూట్ చేశారు. లాక్డౌన్లో పాల్గొని... ప్రభుత్వ సూచనలు పాటించాలని ప్రజలకు సూచించారు.
TAGGED:
MLA program at yellandu