తెలంగాణ

telangana

ETV Bharat / state

మంత్రుల పర్యటన రద్దు.. కలెక్టరేట్​లో బాధితులకు పరామర్శ..! - తెలంగాణ వార్తలు

లైంగిక బాధితులను పరామర్శించాల్సిన మంత్రుల పర్యటన రద్దయింది. గ్రామంలో పర్యటిస్తే గ్రామ ప్రతిష్ఠ దెబ్బతింటుందని భావించి... వారి పర్యటను రద్దు చేశారు. బాధితులను కలెక్టరేట్​కు పిలిపించి పరామర్శించారు.

ministers-visiting-cancel-for-some-issues-at-laxmidevipally-mandal-in-bhadradri-kothagudem
అక్కడ మంత్రుల పర్యటన రద్దు... బాధితులనే రమ్మన్నారు!

By

Published : Dec 30, 2020, 1:42 PM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలంలో మంత్రులు సత్యవతి రాఠోడ్, పువ్వాడ అజయ్ సందర్శించాల్సిన పర్యటన రద్దయింది. ఉపాధ్యాయుడు లైంగికంగా వేధించిన బాధితులను మంత్రులు పరామర్శించాల్సి ఉంది. కానీ మంత్రుల పర్యటన వల్ల ఆ గ్రామ ప్రతిష్ఠ దెబ్బ తింటుందని భావించి... వారి పర్యటనను రద్దు చేసుకున్నారు.

బాధితులను కలెక్టరేట్​కు రప్పించి పరామర్శించారు. మంత్రుల పర్యటనకు ముందు రోజు నుంచే గ్రామాల్లో నానా హంగామాతో వేదికను ఏర్పాటు చేయడాన్ని పలువురు విమర్శించారు.

ఇదీ చదవండి:నిరసనల్లో నారీభేరి- వెనక్కి తగ్గని మహిళా రైతులు

ABOUT THE AUTHOR

...view details