తెలంగాణ

telangana

ETV Bharat / state

పినపాకలో పూర్తయిన బీటీపీఎస్​ రెండో యూనిట్ సింక్రనైజేషన్​ - minister jagadish reddy started btps unit 2 synchronization

హైదరాబాద్​లోని విద్యుత్​ సౌధ కార్యాలయం నుంచి విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్​రెడ్డి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో భద్రాద్రి థర్మల్​ విద్యుత్ కేంద్రం యూనిట్​-2 సింక్రనైజేషన్​ను స్విచ్​ ఆన్​ చేసి శుక్రవారం ప్రారంభించారు. త్వరలోనే రెండో యూనిట్​ సీవోడీని పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

minister jagadish reddy started btps unit 2 synchronization
పినపాకలో పూర్తయిన బీటీపీఎస్​ రెండో యూనిట్ సింక్రనైజేషన్​

By

Published : Jul 3, 2020, 8:15 PM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో భద్రాద్రి థర్మల్​ విద్యుత్ కేంద్రం యూనిట్​-2 సింక్రనైజేషన్​ను శుక్రవారం నిర్వహించారు. హైదరాబాద్​లోని విద్యుత్​ సౌధ కార్యాలయం నుంచి విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్​రెడ్డి స్విచ్​ ఆన్​ చేసి ప్రారంభించారు. సింక్రనైజేషన్​తో ఉత్పత్తయిన 50 మెగావాట్ల విద్యుత్​ను గ్రిడ్​కు అనుసంధానం చేశారు.

కొవిడ్​-19 విపత్కర పరిస్థితుల్లోనూ సింక్రనైజేషన్​ విజయవంతమయ్యేందుకు కృషి చేసిన అధికారులు, ఇంజినీరులను మంత్రి అభినందించారు. త్వరలోనే రెండో యూనిట్​ సీవోడీని పూర్తి చేయాలని అధికారులకు దృశ్య మాధ్యమ సమీక్షలో తెలిపారు. డిసెంబర్​ 2020లో యూనిట్​ 3 సీవోడీ, యూనిట్ 4 సింక్రనైజేషన్​ పూర్తి చేసేలా ప్రణాళికలు తయారుచేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details